Hindu Mantras

Contact us

Wednesday, March 17, 2010

దారిద్ర్యాన్ని పారద్రోలాలంటే..!


సూర్యమంత్రాన్ని స్తుతిస్తే దారిద్యాన్ని పాలద్రోల వచ్చునని పండితులు అంటున్నారు. "ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్యః శ్రీం" అనే మంత్రాన్ని రోజుకు 3వేల సార్లు జపం చేస్తూ 40 రోజుల్లో 120,000 సార్లు చేయాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

ఈ మంత్రాన్ని ఎవరికి వారే చేయాలి. రెండో వారిచే చేయించరాదు. సూర్యమంత్రానికి గొప్ప మహిమ ఉందని, పై మంత్రాన్ని పైన చెప్పినట్లు ప్రతిరోజు స్తుతిస్తే ధనవంతులౌతారని పండితులు వెల్లడిస్తున్నారు.

అదేవిధంగా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, సూర్యోదయ సమయాన ఆదిత్యుడిని మనసారా ప్రార్థించే వారికి ఎలాంటి సమస్యలు దరిచేరవని విశ్వాసం. సూర్యోదయ సమయాన ఆదిత్యుడిని దర్శించుకుని, నిష్ఠతో స్తుతించే వారికి కంటిచూపు ప్రకాశవంతమవుతుందని పండితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment